Friday, 31 May 2019

యువతిని నమ్మించి డబ్బు కొట్టేసిన కేటుగాళ్లు

ఉద్యోగం కోసం వెతుకుతున్న ఓ యువతిని సైబర్‌ నేరగాళ్లు మోసగించి డబ్బు కొట్టేసిన వైనమిది. కూకట్‌పల్లి అడ్డగుట్ట సొసైటీకి చెందిన యువతి(21) ఉద్యోగాన్వేషణలో భాగంగా షైన్‌.కాం వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుంది. వెబ్‌సైట్‌ సిఫారసు మేరకు ఐబీఎం సంస్థలో కొన్ని సాంకేతిక పరీక్షలకు హాజరైంది. ఈక్రమంలో గత నెల చివరి వారంలో షైన్‌.కాం ఉద్యోగి పేరిట ఆమెకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూకు హాజరవాల్సి ఉంటుందని సదరు ఉద్యోగి చెప్పాడు. ఇంటర్వ్యూ నిమిత్తం కొంతమొత్తం డబ్బు చెల్లించాలని కోరాడు. అలా మొదలైన వసూళ్లపర్వం నాలుగు రోజులపాటు పలు విడతలుగా సాగింది. జాబ్‌ ఆఫర్‌ లెటర్‌, కన్ఫర్మేషన్‌.. పేరిట ఆన్‌లైన్‌లోనే పలు బ్యాంకు ఖాతాలకు డబ్బులను జమ చేయాల్సి వచ్చింది. అలా మొత్తం సుమారు రూ.2లక్షలు చెల్లించిన తర్వాత తన ఫోన్లకు స్పందించడం మానేయడంతో మోసపోయానని బాధితురాలికి అర్థమైంది. దీంతో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

No comments:

Post a Comment